Wednesday, 28 May 2014

వ్యక్తి మరియు సమాజంపై పాప ప్రభావం


బుద్ధి చేసే బోధనలకు బానిసయి మనిషి, అల్లాహ్‌ మార్గానికి దూరమైపోతాడు. మనసు కోరిన కోరికల మేరకు తన జీవన పథాన్ని నిర్మించుకుంటాడు. సత్యం, సదాచారాం, సత్కార్యాలు అతని చూపుకు ఆనవు. వీటికి బదులు స్వార్థం, స్వలాభం, స్వప్రయోజనాలు ప్రాధాన్యత వహిస్తాయి. అతను తన మనో కాంక్షలనే తనకు అవసరయోగ్యమయినవిగా భావిస్తాడు. మరో విధంగా చెప్పాలంటే, తన కాంక్షలనే దైవంగా చేసుకుంటాడు. మనిషి ఈ మనో స్థితిని ఇలా అద్దం పట్టి చూపిస్తు ంది ఖుర్‌ఆన్‌: ”నీవు ఎప్పుడయినా ఆ వ్యక్తి పరిస్థితిని గమనించావా-తన మనోకాంక్షల నే తన దైవంగా చేసుకున్నవాడిని?”. (ఫుర్‌ఖాన్‌: 43)
దైవప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా ఉపదేశిం చారు: ”స్వర్గం మనసుకి రుచించని విషయాలతో కప్పబడి ఉంది. నరకం మనోభిరామ కాంక్షలతో కప్పబడి ఉంది”. (ముత్తఫఖున్‌ అలైహి)
సజ్జన పాఠకుల్లారా! సృష్టిలోని సమస్తమూ శోభతో, సువ్యవస్థతో, సామరస్యంతో వ్యవహ రిస్తోందంటే, అంతా ఒకే సృష్టికర్త, ఒకే ప్రభువు, ఒకే నిర్వహణకర్త అయిన అల్లాహ్‌ ప్రచండ అధికారానికి తల ఒగ్గినందుకే. సర్వం ఆయన దాస్యంలో స్వయం సమర్పణ చేసుకోవడం మూలానే ప్రకృతి వ్యవస్థలో ఈ సమన్వయం, సామరస్యం, ఏకత్వంలో భిన్న త్వం, భిన్నత్వంలో ఏకత్వం సాధ్యమయింది.  ప్రపంచ వ్యవస్థలోనూ నెమ్మది, శాంతి, తృప్తి నెలకొనాలంటే, మనం సయితం ఆ ఒక్క నిజ ఆరాధ్యునికే తల వంచాలి. ఆయన విధేయు లమయి జీవించాలి. అదే ప్రకృతిలో సామ రస్యం పొందగల మార్గం. అదే ప్రకృతి అను సరించే విధానం. అదే విశ్వమంతటా విస్తరిం చిన వాస్తవం. ఒక్క మాటలో చెప్పాలంటే, విధేయత, సత్కర్మ మనిషిని ఇహపరాల్లో సాఫల్య బాటన విజయవంతంగా నడిపిస్తే, అవిధేయత, పాపం, దుష్కర్మ మనిషిని ఇహ పరాల్లో పరాభావానికి, అధోగతికి గురి చేసి అపకీర్తి పాలు చేస్తుంది.
‘పాపం, అవిధేయత అనేది పుణ్యం, విధేయ తకు విరుద్ధమయినది. షరీయతు పరిభాషలో -పాపం, అవిధేయత అంటే, అల్లాహ్‌ ఆదేశించిన, ఆయన ప్రవక్తలు ప్రబోధించిన, ఆయన గ్రంథాలు ఉపదేశించిన అంశాలను విడ నాడటం, వ్యతిరేకించడం’ అన్నారు అల్లామా ఇబ్ను తైమియా (ర).   ఖుర్‌ఆన్‌ హదీసుల్లో అవిదేయత అనేక అర్థాల్లో వాడబడింది. పాపం, తప్పు, చెడు, అనైతికత, అశ్లీత, అసభ్యత, అవినీతి, అక్రమం, అన్యాయం, దౌర్జన్యం, దుర్మార్గం, అపమార్గం, అసత్యం, అలజడి, అల్లకల్లోలం,నీచత్వం, లోభం,వ్యామోహం, మదం, మత్సర్యం, విధ్వం సం, అత్యాచారం, హద్దు మీరడం, మూర్ఘత్వం, మంకుతనం, ఉప ద్రవం, హత్య..మొదలయిన అర్థాల్లో చెప్పబడింది.
సజ్జన పాఠకుల్లారా! నేడు ఎటు చూసినా, అశాంతి, అలజడి, అశ్లీ లం, అనైతికం, అమానవీయం, అక్రమం, అన్యాయం విలయతాం డవం చేస్తున్నాయి. కోట్లకు పడగలెత్తిన కుబేరులు మొదలు కూటికి గతిలేని ఆమ్‌ ఆద్మీ వరకు ఈ సామాజిక రుగ్మతల వాతన పడిన వారే. కారణం, అల్లహ్‌ ఆదేశాల పట్ల అశ్రద్ధ, అలక్ష్యం, అవిధేయ తలే. ఖుర్‌ఆన్‌ ఇలా హెచ్చరిస్తుంది: ”ఎవరయితే అల్లాహ్‌కు, మరియు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతారో వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనయినట్లే జాగ్రత్త!”. (అహ్జాబ్‌:36)
”ఎవడు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స) యెడల అవిధేయుడయి ఆయన నిర్ధారించిన హద్దులను మీరిపోతాడో వాడ్ని నరకాగ్నిలో పడ వేస్తాడు. వాడందులో కలకాలం పడి ఉంటాడు. అవమానకరమ యిన శిక్ష అలాంటి వారి కోసమే ఉంది”.
దీనికి భిన్నంగా – ”అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స)కు విధే యత చూపేవారికి అల్లాహ్‌, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల లో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప విజయం అంటే ఇదే”. (నిసా: 13) కాబట్టి పాపం అది చిన్నదయినా, పెద్దదయినా మనం మాత్రం దానికి దూరంగా మసులుకోవాలి.
పాపాలు అనేవి కబీరా-పెద్దవి, సగీరా-చిన్నవి అన్న రెండు భాగాలు గా ఉన్నప్పటికీ, తప్పు అని తెలిసి కూడా మంకుతనం మానక నిశ్శం కోచంగా పాల్పడే ఏ చిన్న పాపం చిన్నదిగా ఉండదు. అలాగే పశ్చా త్తాపం చెంది, తౌబా చేసుకున్న తర్వాత ఏ పెద్ద పాపం పెద్ద పాపంగా మిగులదు అన్నారు పండితులు. అలాగే పాపాలను మూడు శ్రేణుల్లో విభజించారు ఇబ్ను తైమియా (ర).
1) ప్రజలపై చేసే దౌర్జన్యం: అన్యాయంగా ఒకరి ఆస్తికి హక్కుదారులై కూర్చోవడం. ఒకరికి దక్కాల్సిన హక్కుల్ని కాలరాయడం. ఒకరికి ప్రాప్తమయి ఉన్న అనుగ్రహాలను చూసి ఓర్వలేనితనంతో కుతకుత లాడటం.
2) ఆత్మపై దౌర్జన్యం: మద్యం, మాదకద్రవ్యాల సేవనం, వ్యభిచారం.. వగైరా.
3) రెండూ కలగలసిన దౌర్జన్యం: అక్రమార్జనతో మాదకద్రవ్యాల సేవనం. అధర్మ ఆస్తితో మగువ లోలత్వానికి బానిస్వడం వగైరా.
ఈ పాపాలనే మరో రకంగా కూడా విభజించవచ్చు.
1) విశ్వాస పరమైన పాపాపలు: షిర్క్‌-బహుదైవారాధన, కాపట్యం, ప్రదర్శనాబుద్ది వగైరా…
2) నైతిక పరమైన పాపాలు: మద్యపానం, వ్యభిచారం, వగైరా..
3) ఆరాధనల పరమైన పాపాలు: నమాజుకు వెళ్ళక పోవడం, జకాత్‌ చెల్లించకపోవడం వగైరా…
4) ప్రవర్తనా పరమైన పాపాలు: వాగ్దాన భంగం, దొంగతనం, దోపిడి, లంచం, వడ్డీ వగైరా…పోతే పాప ప్రభావ విషయానికొస్తే అది రెండు విధాలు – వ్యక్తిపరమైనది, సామాజికపరమైనది.

వ్యక్తిపరమైనది -హృదయాలకు తుప్పు పడుతుంది:

దైవప్రవక్త (స) అన్నారు: ”ఏ హృదయంలోనయితే అల్లాహ్‌ా స్మరణ ఉంటుందోఅది సుబిక్ష హృదయం.మరే మనస్సులోనయితే అల్లాహ్‌ స్మరణ ఉండదో అది దుర్బిక్షమయిన హృదయం-పాడుబడిన బంగళా వంటిది” అని. మరో సందర్భంలో ఆయన హృదయం వైపు సైగ చేస్తూ ”దైవభీతి ఇక్కడుంటుంది” అని అన్నారు.
ఏ హృదయం అయితే అల్లాహ్‌ ఘనతా ఔన్నత్యాలకు ఆలయ మయి ఉంటుందో, మరే హృదయంలోనైతే అల్లాహ్‌ పట్ల భక్తిప్రప త్తులు ఉప్పొంగుతాయో, అల్లాహ్‌ భీతితో కంపించిపోతుందో ఆ హృదయానికి అల్లాహ్‌ అన్నా, అల్లాహ్‌ ఆదేశాలన్నా, ఆయన ప్రవక్త లన్నా, వారి ప్రబోధనాలన్నా, ఆయన గ్రంథాలన్నా, వాటి ప్రవచ నాలన్నా వల్లమాలిన అభిమానం, గౌరవం ఉంటుంది. ఫలితంగా అలాంటి హృదయం కలిగిన వ్యక్తుల జీవితాలు ప్రశాంతంగా, వారి మనో సీమలు ప్రకాశమానంగా ఉంటాయి.
మరెవరి గుండెల్లోనయితే అల్లాహ్‌ భయం, భక్తి సన్నగిల్లుతుందో అట్టి గుండెల్లో గుబులు అనే గుబురు పొదలు పేరుకుపోతాయి. అవి అదే స్థాయి ఏమరుపాటుకి గురవుతాయి. దీని గురించి వివ రిస్తూ దైవప్రవక్త (స) ఇలా విశదపర్చారు: ”దాసుడు ఒక మంచి కార్యం చేస్తే అతని హృదయ ఫలకంపై ఒక తెల్లని మచ్చ ఏర్పడు తుంది. ఆ సత్క్రియ క్రమాన్ని అతను అలానే కొనసాగిస్తే మొత్తం హృదయం కాంతిమయమైపోతుంది. అదే అతను పాపం చేస్తే అతని మనోఫలకంపై ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది.ఆ దుష్క్రియ క్రమాన్ని అతను గనక కొనసాగిస్తే అది పెరిగి మొత్తం హృదయం చీకటిమయం అయిపోతుంది. దాన్నే ‘రైన్‌-తుప్పు’ అంటారు. దాని గురించే ఖుర్‌ఆన్‌ ఈ విధంగా పేర్కొంది: ”అసలు విషయమేమి టంటే, వారి హృదయాలకు వారి దుష్కార్యాల తుప్పు పట్టింది”.  (ముతఫ్ఫిఫీన్‌: 14)
మరో చోట ఇలా సెలవియ్యబడింది: ”(వారి) చర్మచక్షువులకు అంధత్వం లేదు. వారి హృదయాలకు ఉన్న ఆత్మచక్షువులకే అంధ త్వం ఆవహించింది”. (హజ్జ్‌:46)
ఫలితంగా వారు పంచేంద్రియాలు, జ్ఞానేంద్రయాలు ఉండి కూడా సత్యాన్ని గ్రహించే శక్తిని కోల్పోతారు. ఇక ఎవరి హృదయ కవా టాలు మూసుకుపోతాయో అతని అవయవాలన్నీ ఎన్ని సత్యాలు చూసినా, విన్నా స్పదించవు. ఆ ఆత్మచక్షువుల అంధత్వం వారి వద నాలపై, వారి ఆలోచనపై, వారి ప్రతిపాదనలపై, వారి నడకలపై, నడవడికలపై కొట్టుకొచ్చినట్లు కనబడుతుంది.  హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ అబ్బాస్‌ (ర) ఇలా అభివిర్ణించారు: ”సత్కర్మ ఫలితంగా మనిషి వదనం కాంతులీనుతోంది. హృదయం జ్యోతీర్మయం అవుతోంది. ఉపాధిలో సమృద్ధి శుభాలు ఒనగూడుతాయి. శరీరంలో శక్తి చోటు చేసుకుంటుంది. సృష్టిచరాచరాల గుండెల్లో ఆ వ్యక్తి కోసం ప్రేమాభి మానాలు పెల్లుబుకుతాయి. ఇది సత్కర్మ ప్రభావమయితే, దుష్కర్మకు పాల్పడే వ్యక్తి వదనం దుమ్ముకొట్టుకొని కళాహీనమయి ఉంటుంది. హృదయంలో చీకట్లు రాజ్యమేలుతాయి. శరీరంలో సత్తువ నశి స్తుంది. ఉపాధిలో శుభం లేకుండా పోతుంది. సృష్టిరాసుల మనస్సు లో ఆ వ్యక్తి పట్ల ద్వేషభావన, ఏహ్యభావన నిండి పోతుంది.
ఓ సందర్భం ఒక వ్యక్తి ‘మంచీచెడులను ఎలా అంచనా కట్టాలి?’ అని మహనీయ ముహమ్మద్‌ (స) వారిని అడిగాడు. దానికి బదులి స్తూ ఆయన-”ఓ పని చేస్తూ నీకు అంతరంగికంగా ఆత్మానందం కలిగిందంటే అది మంచి అని తెలుసుకో. ఒక పని చేస్తూ నీ ఆంత ర్యంలో శంక కలిగి, ప్రజలు ఎక్కడ చూస్తారేమో అన్న భయం ఏర్ప డితే మాత్రం అది చెడు అని గుర్తుంచుకో!” అని అన్నారు ప్రవక్త (స).
మనం చేస్తున్నది మంచా, చెడా? మనం మంచి వ్యక్తులమా, చెడ్డ వ్యక్తులమా? అన్నది మన అంతరాత్మకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. కాబట్టి ఒకరి దృష్టిలో మనం ఎలాంటి వారం అన్నది మన కు సంబంధించిన విషయం కాకపోవచ్చు కానీ, మన దృష్టిలో మనం ఎలాంటి వారం అన్నది మాత్రం పూర్తిగా మనకు సంబంధిం చిన విషయం. అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”నిశ్చయంగా ఆత్మ ప్రక్షాళన చేసుకున్నవాడు ధన్యుడు. అంతరాత్మ ఘోషను అణచి పెట్టినవాడు నాశనమవుతాడు”. (షమ్స్‌:8,9)
ఇక ఎవరయితే తమ అంతరాత్మ గొంతును నిర్ధాక్షిణ్యంగా నులిమి వేశారో, ఎవరి మనో సీమలయితే దానవత్వానికి దగ్గరగా దాన గుణానికి దూరంగా తయారయ్యాయో వారు చెడును మంచిగా, మంచిని చెడుగా, నాగరికతను అనాగరికతగా, ఆటవికాన్ని ఆధు నికంగా చూస్తారు. ఫలితంగా అంతిమ శ్వాస ఆగే అంతిమ ఘడి యల్లో ‘కలిమా-లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’కు సయితం నోచుకోకుండా చెడ్డ చావు చస్తారు
 వ్యక్తి మరియు సమాజంపై పాప ప్రభావం

నమాజు చేద్ధాం! ఛలో, ఛలో!!


ప్రియ మిత్రుల్లారా! ధీర విస్వాసి, గొప్ప సహాబీ ఖుబైబ్‌ బిన్‌ ఆదీ గరించి విన్నారా? ఇస్లాం స్వీకరించినందుకుగాను అవిశ్వాసులు ఆయన్ను చిత్రహింసలు పెట్టి మరీ చంపారు. దారుణంగా హింసిస్తూ ప్రాణం పోవడానికి కొన్ని ఘడియల ముందు ‘నీ చివరి కోరిక ఏమిట?’ గుండెల్లో గునపం దింపి అడిగారు. అందుకు ఆయన తట పటాయించకుండా ‘రెండు రకాతుల నమాజు చేసుకోవాలన్నది నా చివరి ఆకాంక్ష’ అని సమాధానమిచ్చారు. వారి నుండి లభించిన అను మతితో రెండు రకాతులు పూర్తి చేసి ఇలా అన్నారు: ”ఇది నా జీవితపు అంతిమ ఆరాధన గనక సుదీర్ఘంగా చేయాలన్న అభిలాష ఎంతో ఉన్నా, ‘చావు భయంతో నమాజుని సుదీర్ఘం చేసి చదువుతున్నాడు’ అన్న అపవాదు అవిశ్వాసల తరఫున రాకూడదని నేను నా ప్రార్థనను సంక్షిప్తంగా చేసి ముగించాను”.
ప్రియ మిత్రుల్లారా! యాతనలతో కూడిన, చిత్రహింసలతో కూడిన చావు అందరికి రాకపోవచ్చు. కానీ, అందరూ చావడం మాత్రం ఖాయం. ఒకవేళ మనకే మరణ ఘడియలు దాపురించి ‘నీ చివరి కోరిక ఏమిట?’ అని ఎవరయినా మనల్ని అడిగినా, అడగకపోయినా మన చివరి కోరికి ఏమై ఉంటుందో? ఏమై ఉండాలో? మనలోని ప్రతి ఒక్కరు ఆత్మ సమీక్ష చేసుకోవాలి. అమ్మానాన్నలను చూడాలనుకుం టామా? భార్యాపిల్లలతో గడపాలనుకుంటామా? మన అభిమాన వ్యక్తి తో భేటి అవ్వాలనుకుంటామా? ఏదైనా ఆట ఆడాలనుకుంటామా? ఆస్తిపాస్తులను మరొక్కమారు లెక్కబెట్టుకోవాలనుకుంటామా? మిగిలి ఉన్న ఆ కొద్ది ఘడియల్ని సయితం సినిమాలు, సిత్రాలు అంటూ వృధా చేస్తామా?  లేదా ‘నన్నొదలండి, రెండు రకాతుల నమాజు చేసుకోవా లన్నది నా చివరి ఆకాంక్ష’ అని అల్లాహ్‌ా పట్ల మనకున్న అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తామా?
అయినా అంత పునీతమయిన మాట మన నోట వెలువడాలంటే, నమాజు మధురానుభూతి తాలూకు పూర్వానుభవం మనకుంటేనే కదా? జీవితంలో ఒకట్రెండు మార్లు తోచినప్పుడు, తోచిన విధంగా వారానికో, మాసానికో, సంవత్సరానికో ఒక సారి నమాజు చేసే వారికి నమాజు మహిమ ఎలా తెలుస్తుంది? చెప్పండి. ‘ఒక నమాజు మరో నమాజుకి మధ్య జరిగే పాపాలను ప్రక్షాళిస్తుంది’ అన్నారు ప్రవక్త (స). అసలు నమాజే చదవని వ్యక్తి తన పాపాల్ని ఏం చేెస్తాడు?  అతని పాప ప్రక్షాళనామార్గం ఏమిటి? అతను పాప ఊబి నుండి విముక్తి పొందే దారేది?
ప్రియ మిత్రుల్లారా! రోజుకి పది సార్లు ‘హయ్యా అలస్స్వలాహ్‌ – నమాజు వైపునకు రండి!’ అని, 10 సార్లు ‘హయ్యా అలల్‌ ఫలాహ్‌ా- సాఫల్యం వైపునకు రండి!’ అని అయిదు పూటల నమాజు కోసం ఇచ్చే అజాన్‌ రూపంలో స్వయంగా అల్లాహ్‌ా మనల్ని పిలుపునిస్తున్నాడు. అయినా మనం ఆయన ఆప్త పిలుపుకి స్పందించడం లేదు. ‘నేను హాజరయ్యాను స్వామీ’ అని జవాబు పలకడం లేదు. ‘కర్మకు తగ్గ ఫలం’ అన్నట్టు అల్లాహ్‌ా ఆప్త పిలుపు పట్ల ఇలా అమర్యాదగా వ్యవహ రించిన వ్యక్తిని అల్లాహ్‌ా అభిమానించి సత్కరిస్తాడని, సన్మానిస్తాడని ఎలా భావించగలం? చెప్పండి. నిజమయిన కీర్తి ఎవరికి వారుగా ఇచ్చుకునేది, ఒకరిస్తే పుచ్చుకునేది కాదు. అల్లాహ్‌ా అనుగ్రహించినది మాత్రే నిజమైన కీర్తి, వాస్తవ గౌరవం. ‘దాసుడు అత్యంత సమీపంగా దైవానికి సజ్దా స్థితిలో ఉంటాడు’ అని ప్రవక్త (స) వారు అన్నారు. మరే వ్యక్తయితే జీవితంలో ఒక్కసారి కూడా అల్లాహ్‌ా సన్నిధిలో పూర్ణ హృద యంతో, పూర్ణ బలంతో, పూర్ణ విశ్వాసంతో ఒక్క సజ్దా కూడా చేసి ఎరుగడో అతని వదనం దేదీప్యమానం ఎలా అవుతుంది. అతని జీవి తం నిండు కళను ఎలా సంతరించుకుంటుంది?అతనికి కీర్తి ఎలా ఒన
గూడుతుంది?అతనికి  రేపు తీర్పు దినాన పుల్‌సిఇరాత్‌ వారధి దాటేం దుకు కావాల్సిన జ్యోతి ఎలా ప్రాప్తిస్తుంది? శరీరానికే తలమానికం అయిన శిరస్సును ఆ సర్వలోక పాలనాధీశుని సన్నిధానంలో వంచి నప్పుడే దానికి సిసలైన గౌరవం అసలయిన కీర్తి అని ఎరుగని వ్యక్తి ఎలా సంస్కారంతుడు అనిపించుకుంటాడు? చేసిన అర్థ రూపాయి సహాయానికి కృతజ్ఞత కోరుకునే మనిషి అల్లాహ్‌ ప్రసాదించి అనన్య అనుగ్రహాల్ని అనుభవిస్తూ, అగణ్య వరాలను పొంది కూడా అల్లాహ్‌ పట్ల పూర్తి అణుకువ కూడిన ఒక సజ్దా చేయకపోవడం ఎంత దుర దృష్టకరం!  దాసుడు దైవ సన్నిధికిలో నిలబడి అల్లాహ్‌ను స్మరించ డమే ఆలస్యం ‘నేనున్నాను’ అంటూ బదులిస్తాడు. అట్టి దయాసాగరు ని సన్నిధికి వెళ్ళనివాడు ఎంత దరిద్రుడో ఆలోచించండి.
ప్రియ మిత్రుల్లారా! నమాజు ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. అల్లాహ్‌ా ఆదేశం.అల్లాహ్‌ పంపగ వచ్చిన ప్రవక్తలందరూ ఎంతో ఇష్టం గా పాటించిన సంప్రదాయం. మానవుల్లోనే శ్రేష్టులయిన ప్రవక్తలు భక్త్తిప్రపత్తులతో నమాజు చేయడం, సామాన్య వ్యక్తులయిన మనం చేయకపోవడం దేన్ని సూచిస్తుందో యోచించండి! ఇది మనలో దుర హంకార వైఖరికి నిదర్శనం కాదా? లేదా ‘దురంహాకర దురంధురుల వైపు అల్లాహ్‌ కన్నెత్తి కూడా చూడడు’ అని ప్రవక్త (స) చేసిన హెచ్చ రిక మన చెవిన పడలేదా?
కొందరు సంపద లేమితో సతమతమవుతూ ఉండొచ్చు. కొందరు సంతాన లేమితో బాధ పడుతూ ఉండొచ్చు. కొందరు సంతాప సము ద్రంలో మునిగి ఉండొచ్చు. అన్ని రోగాలకు, అన్ని బాధలకు, అన్ని సమస్యలకు పరిష్కారం నమాజు. నమాజు చదివి ప్రవక్త జకరియ్యా (అ) పొందిన శుభవార్తను మనమూ పొందాలి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”కుటీరంలో నిలబడి (జకరియ్యా -అ)నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి, ‘అల్లాహ్‌ నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతను అల్లాహ్‌ వాక్కును ధృవ పరుస్తాడు.  నాయకుడవుతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు, దైవప్రవక్త, దైవ వర్తనులకోవకు చెందినవాడై ఉంటాడు” అని చెప్పారు.   (ఆలి ఇమ్రాన్‌: 39)
ప్రజలు నమాజు చేసుకుంటున్నారు.నమాజు చెయ్యకుండా ఓ మూల నిలబడి ఉన్న వ్యక్తినుద్దేశించి ”ఏమిటి? నువ్వు ముస్లింవి కాదా?”అని ఆరా తీశారు ప్రవక్త (స). రేపు ప్రళయదినాన నమాజు   పట్ల   మన నిర్లక్ష్యాన్ని చూసి ‘ఏమిటి మీరు ముస్లింలు కారా?’ అని ప్రవక్త (స) మనల్ని నిలదీయడం మనకు ఇష్టమేనా?
నమాజు సలిపే ప్రతి వ్యక్తి ముఖారవిందంలో ప్రార్థనా తాలూకు తేజస్సు తొణికిసలాడుతూ ఉంటుంది. ప్రజల నుదుళ్ళపై కనబడే నల్లని మచ్చ కాదు.. అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో పేర్కొన్న ఛాయ. నల్ల ఛాయో, తెల్ల ఛాయో, పశుపు పచ్చని ఛాయో, ఏర్ర ఛాయో కాదు; అది అక్షరాల నమాజు ఛాయ. ”అల్లాహ్‌ కృపను, ఆయన ప్రసన్న తను చూరగొనే ప్రయత్నంలో వారు వినమ్రులయి రుకూ చేయ డాన్ని, సజ్దా చేయడాన్ని నీవు చూస్తావు. వారి సజ్దా ప్రత్యేక ప్రభా వం వారి ముఖార ందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది.”  (అల్‌ పతహ్‌: 29)
అల్లాహ్‌ాకు మిక్కిలి ప్రియమయిన నమాజు ఛాయను నోచుకో కుండా పోయిన వ్యక్తి ఎంత మేలిమిచ్ఛాయ కలిగి ఉన్నా అంతిమం గా నరకాగ్నిలో కాలి నల్లబడాల్సిందే! నరకవాసుల గురించి తెలియ జేస్తూ అల్లాహ్‌ా ఇలా అంటున్నాడు: ”వాడు సత్యాన్ని ధృవీకరించనూ లేదు. నమాజు చదవనూ లేదు. పైగా వాడు ధిక్కరించాడు. వెను తిరిగి పోయాడు. మిడిసి పడుతూ తన ఇంటి వారల వైపు వెళ్ళి పోయాడు. శోచనీయనం! నీ వైఖరి కడు శోచనీయం!! మరీ విచార కరం! నీ ధోరణి మిక్కిలి విచారకరం!!” (ఖియామా:31-35)
”ఆ రోజు (స్వర్గవాసులు నరకవాసుల్ని ఉద్దేశించి) ఇంతకీ ఏ విష యం మిమ్మల్ని నరకానికి తీసుకొచ్చింది? అని అడుగుతారు. వారి లా సమాధానం ఇస్తారు. ‘మేము నమాజు చేసేవారము కాము. నిరుపేదలకు అన్నం పెట్టే వారమూ కాము. పైగా మేము పిడి వాదన చేసేవారితో చేరి వాదోపవాదాలలో మునిగి ఉండేవారము. ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళము. తుదకు మాకు మరణం వచ్చేసింది”. (దహ్ర్‌ా: 43-47)
మరి మనం నరకవాసుల్లోనే ఉండిపోదామా? స్వర్గవాసుల స్థాయి ని అందుకునే అవిరళ కృషికి పూనుకుందామా? మరి స్వర్గవాసులు ఎవరంటారా? అదీ ఆ కృపాసాగరుని మాటల్లోని వినండి – ”వారు అగోచరాలను విశ్వసిస్తారు. నమాజును స్థాపిస్తారు”. (బఖరా:2)
అల్లాహ్‌ కృప వల్ల మనం విశ్వాసులం; మంచిదే. కానీ, నమాజు చదవడం లేదు ఎందుకు?
తమ తమ ఇళ్ళకు వెళ్ళాలనుకున్న యువకుల్ని ఉద్దేశించి ప్రవక్త (స) వారు చేసిన ప్రధమ హితవు ఏమిటో తెలుసా? ”నమాజు స్థాపించండి” అన్నది. నమాజు చదివే వ్యక్తి అల్లాహ్‌ాకు అత్యంత సమీపంగా ఉంటే, చదవని వ్యక్తి అందరికన్నా దూరంగా ఉంటాడు. అమ్మనాన్న, అక్కాచెల్లెల్లు, అన్నాదమ్ముళ్లు, ఆప్తులు స్నేహితులు – ఇలా ఎవరితోనయినా దూరంగా ఉండి బ్రతకొచ్చు కానీ, అల్లాహ్‌ా కు, ఆయన కృపాకటాక్షాలకు దూరంగా ఉండి ఎవరు బ్రతికి బట్ట కట్టగలరు చెప్పండి! ఏమిటి, ”ఆ తర్వాత కొందరు అయోగ్యులు వచ్చి నమాజులను వృధా చేశారు. మనోవాంఛలకు బానిసలయి బ్రతికారు” (మర్యమ్‌; 59) అని స్వయంగా అల్లాహ్‌ాయో ‘అయో గ్యులు’ అన్న వారి జాబితాలో చేరడం మనకిష్టమేనా.? ‘బే నమాజీ’ అని అందరూ ఎద్దేవ చెయడం మన నచ్చుతుందా?
మనం  ఎంత అంగ బలం, అర్థ బలం, అధికార బలమయినా కలిగి ఉండొచ్చు. అందం రీత్యా మనం విశ్వ సుందరులే కావచ్చు. కానీ, మనం నమాజును వేళకు చేయకపోతే అల్లాహ్‌ దగ్గర మాత్రం కటిక దరిద్రులం, అందవిహీనులం, అజ్ఞానులం, దుష్టులం, దుర్మార్గు లమే. ఇది మనకు సమ్మతమేనా?
ప్రియ మిత్రుల్లారా! అల్‌హమ్దులిల్లాహ్‌ా మనం రోజుకి అయిదు సార్లు అజాన్‌ వింటున్నాము. ఖుర్‌ఆన్ను దైవగ్రంథంగా విశ్వసిస్తున్నాము. ఖుర్‌ఆన్‌లో నమాజును స్థాపించండి అన్న ఆదేశం అనేెక సార్లు వచ్చిం దన్నదీ మనకు ఎరుకే. ఖుర్‌ఆన్‌ అల్లాహ్‌ా ప్రోక్తం అని బలంగా విశ్వ సించే మనలో రోజుకు ఆయిదు సార్లు నమాజు పిలుపు విని కూడా స్పందన కనబడటం లేదంటే ఏమిటి అర్థం? గుండె అని గుడిలో దైవ భీతి ఉన్నాట్టా? లేదా ఐహిక లాలస, కాంక్షల దాస్యం గూడు కట్టుకు న్నట్టా? ”ఏమిటి. విశ్వాసుల హృదయాలు అల్లాహ్‌ా సంస్మరణ పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మొత్తబడే సమయం ఇంకా ఆసన్నం కాలేదా?” (హదీద్‌: 16)
చూడండి! మనం ఒక కార్యాలయంలోనో, ఒక పాఠశాలలోనో పని చేస్తున్నామనుకోండి.ఆ కార్యాలయం, ఆ పాఠశాల కేటాయించిన సమ యానికి బద్దులయి మసలుకోమా?ఉద్యోగ విషయంలో, వ్యాపార విష యంలో, వివాహ విషయంలో, జీవిత ఇతర విషయాల్లో ఖచ్చితంగా సమయపాలనను పాటించే మనం-”నిశ్వయంగా నమాజును నిర్థారిత వేళల్లో చేయడం విశ్వాసులకు విధిగా చేయబడిది”. (నిసా:103) అని స్వయంగా ఆ సర్వేశ్వరుడే సెలవిస్తుంటే ఆ మాత్రం నీతిని నమాజు విషయంలో పాటించలేకపోతున్నాము. పనీ చేయక, కష్టా పడక అదృ ష్టం వరించాలనుకోవడం, యజమాని నుండి వెతనాన్ని, ఫలితాన్ని కోరుకోవడం దురాశే కదా! మరి దురాశేమో దుఃఖానికి చేటాయో!
ప్రియ మిత్రుల్లారా! సాధారణ దినాల్లోనే కాదు, సంబర ఘడియల్లో సయితం ‘మేము మా ఈ పండుగ రోజుని నమాజుతో ప్రారంభి స్తాము’ అని ప్రవక్త (స) వారు చెబుతుంటే, మనం మన దైనందిన జీవితాన్ని నమాజుతో ప్రారంభించకపోవడం శుభమా? అశుభమా? ఆలోచించండి! మనం శ్వాస పీల్చుకుంటున్న దినం పండుగ దినమే కావచ్చు. షడ్రుచులు మేళవించిన వంటకాలే మనం ఆరగించి ఉం డొచ్చు. నూతన వస్త్రాలు ధరించి మనం నవాబుల్లానే నడుస్తుండొచ్చు, అమ్మనాన్నలు, బంధుమిత్రులు, ఇరుగపొరుగు వారితో యమ జోరు గా వెళ్ళి పలుకరించే ఉండొచ్చు; కానీవీటన్నింటిని మనకు అనుగ్ర  హించిన ఆ నిజ స్వామి సన్నిధానానికి మనం హాజరు కాలేదంటే మనం అనుకుంటున్న ఈ పండగ కూడా  పనికిమాలిందే. ఒక్క మాటలో చెప్పాలంటే, అల్లాహ్‌ా విధేయతలో గడిపిన ప్రతి దినం పండగే. అది లేని ప్రతి క్షణం దండగే.
ప్రవక్త (స) వారి సహచరుల్లో ఎవరి వల్లయినా ఒక నమాజు తప్పి పోతే ‘తన మొత్తం కుటుంబాన్ని పోగుట్టుకున్నట్లు’ వారు ఫీలయ్యే వారు. అవును, ప్రార్థనా ప్రాశస్త్యం వారికి తెలిసినంతగా ఎవరికి తెలి యదు. ఒక్క పూట నమాజు తప్పితేనే వారు అంతగా విలవిల్లాడి పోతున్నారే, మరి మనమేమో రోజులు, వారాలు, నెలలు, ఏండ్ల తర బడి నమాజులను వదులుతూ కూడా చలించడం లేదంటే, మన నుదు ళ్ళపై మడతలు పడటం లేదంటే, మనకు బాధ కలగటం లేదంటే మనలో విశ్వాసం ఉన్నాట్టా, లేనట్టా? ‘నా కంటి చలువ నమాజులో ఉంచ బడింది’ అని స్వయంగా ప్రవక్త (స) వారు సెలువిస్తున్నారు. అంతిమ దినాల్లో నడవలేని స్థితిలో ఇద్దరి సహాయమ కాళిఓలడ్చుకు ంటూ వచ్చి సామూహిక నమాజులో పాల్గొంటున్నారు. మరి మన మేమో ‘సినిమాలు, సిత్రాలు, వ్యర్థ కార్యక్రమాల్ని చూసి మన కళ్లను చల్లార్చుకోవాలనుకుంటున్నామే దీన్నేమనాలి? ”నమాజు స్థాపించే వారిని ప్రశంసాత్మక స్థానం మీద ప్రతిష్టింప జేస్తాను” అని అల్లాహ్‌ా మాటిస్తుంటే, మనమేమో అపకీర్తి అడుసులోనే అట్టడుగున పడి ఉండ టాన్నే ఇష్టపడుతున్నామే, దీన్నేమంటారు?
”అల్లాహ్‌ వారి ఇళ్ళను నిప్పుతో నింపుగాక! వారు మమ్మల్ని అస్ర్‌ నమాజు చేయకుండా చేశారు” అని కందక యుద్ద సమయంలో ప్రవక్త (స) వారు అవిశ్వాసుల్ని అభిశపించారు అంటే ఆలోచించండి, నమాజు ఎంత ఘనతరమయిన ప్రార్థనో! ఆ రోజు యుద్ధ కారణంగా అనేక దైనందిన కార్యాలు వాయిదా పడ్డాయి. ప్రవక్త (స) వాటిని ఖాతరు చేయలేదు. నమాజునే ప్రత్యేకంగా పేర్కొన్నారంటే, సదా దీవె నల్ని కురిపించే ఆయన అధరాలు అభిశపించాయి అంటే, నమాజును వదలడంగానీ, నమాజును చేయకుండా ఆపడంగానీ ఎంత భయంకర నేరమో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇస్లాంలోని ప్రతి ఆదేశం గురించి సమయం సందర్భాన్ని బట్టి మినహాయింపు ఉంది. కానీ, శ్వాస, స్పృహ ఉన్నంత వరకు ఎటువంటి మినహాయింపు లేని ఆదే శం ఒక్క నమాజు విషయంలోనే ఇవ్వబడింది. చివరికి భీకర పోరు జరుగుతున్నా నమాజును వాయిదా వేయడానికి లేదు అంటూ ఆ స్థితిలో చేసే నమాజు విధానాన్ని ప్రత్యేకంగా అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌లో పేర్కొన్నాడంటే, అల్‌హమ్దులిల్లాహ్‌ ప్రశాంత వాతావరణంలో నివ సిస్తున్న మనపై నమాజు తాలూకు బాధ్యత ఏపాటిదై ఉంటుందో యోచించాలి. కొత్తగా ఇస్లాం స్వీకరించిన తాయిఫ్‌ ప్రజలు కొన్ని విషయాలలో మినహాయించపు కోరితే మినహాయింపును ప్రకటించిన ప్రవక్త (స), నమాజు విషయంలో కూడా మినహాయింపునివ్వండి అని విన్నవించుకున్నప్పుడు ‘నమాజు లేని మతధర్మంలో శుభమే మిగు లుండదు’ అని చెప్పారంటే నమాజుకు నోచుకోని మన జీవితం ఎలాంటిదో యోచించండి!
అల్లామా జహబీ (ర) మరణిస్తూ అన్న మాట:”ఏ ఒక్క విధి నమాజు  వదలని శుభ దినంలో నాకు మరణాన్ని ప్రసాదించినందుకు నేను అల్లాహ్‌ాకు వేనవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను’ అన్నా రంటే, అంతిమ దైవప్రవక్త (స) అంతిమ ఘడియల్లో అనేక సార్లు స్పృహ తప్పినా స్పృహ వచ్చిన ప్రతి సారి నమాజు చేయడానికి ప్రయ త్నించేవారంటే, తన గది తెరను తొలగించి నమాజు చేస్తున్న సహచరుల్ని చూసి చల్లని చిరినవ్త్వుకటి ఆయన ఆధరాలపై కదలాడిం దంటే, అంతిమ శ్వాస అగుతున్న సమయంలో సయితం ‘నమాజ, నమాజు…మీ అధీనంలో ఉన్న వారి యెడల ఉత్తమంగా వ్యవహరిం చండి’ అని తాకీదు చేెశారంటే నమాజు ఎంత మహిమాన్వితమయిన ఆరాధనో ఆలోచించండి! ప్రవక్తల, పుణ్యాతుల, సత్పురుషుల, షహీ దుల, ఔలియాల, హదీసువేత్తల  దృష్టిలో అంతటి ఘనపాటి అయిన నమాజు మన దృష్టిలో ఎటువంటి విలువ లేనిదిగా ఉందంటే లోపం ఎవరిదో, ఎవరిలో ఉందో ఎవరి వారే ఆత్మ సమీక్ష  చేసుకోవాలి.

శిష్ఠ వచన విశిష్ఠత


(ఓ ప్రవక్తా!) ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌ – అల్లాహ్‌ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడని నువ్వు బాగా తెలుసుకో”. (ముహమ్మద్‌:19)
‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ ఈ శిష్ఠ వచన ఆధారంగానే భుమ్యాకాశాలు ఉనికిలోకి వచ్చాయి. ఈ వచన వ్యక్తీకరణ, స్మరణ కోసమే సృష్టి చరా చరాల సృజన జరిగింది. ఈ వచనం కోసమే అల్లాహ్‌ా ఇహపరాలను పుట్టించాడు. ఈ శిష్ఠ వచన పరిచయం కోసమే 1లక్ష 24వేల మంది దైవప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఈ వచన ఘనతా ఔన్నత్యాలను చాటడానికే దైవగ్రంథాలు అవతరించాయి. ఈ వచనం కోసమే తీర్పు దినం, లెక్కల ఘడియ, మహ్షర్‌ మైదానం ఏర్పాటు చేయబడింది. ఈ వచనం కోసమే స్వర్గనరకాలు చేయబడ్డాయి. ఈ వచన ఆధారంగానే మనుషులు, జిన్నాతులు-విశ్వాసులుగా, అవిశ్వాసులుగా, సజ్జనులుగా, దుర్జనులుగా, పుణ్యాత్ములుగా, పాపాత్ములుగా వర్గీకరించబడ్డారు. ఈ వచనం మూలానే సృష్టి అదృష్ట దురదృష్టాలు, సౌభాగ్యాసౌభాగ్యాలు, అభ్యున్నతి, అభ్యుదయాలు, ప్రగతి సాఫల్యాలు, సంక్షేమం శ్రేయో శుభాలు, శిక్షాబహుమానాలు ముడి పడి ఉన్నాయి. ఈ వచన ఆధా రంగానే రేపు మన కర్మల త్రాసు బరువుగానైనా, తేలికగానైనా తయా రవుతుంది. ఈ వచన ఆధారంగానే పరలోక మోక్షం ప్రాప్తమవు తుంది. ఈ వచన ఆధారంగానే కొందరు శాశ్వత నరకానికి ఆహుతి అయితే, మరికొందరు శాశ్వత స్వర్గానికి వారసులవుతారు. ఈ వచ నం గురించే అల్లాహ్‌ా పరమాణువుల లోకంలో సకల ఆత్మలతో ‘అలస్తు ప్రమాణం’-నేను మీ ప్రభువు కానా!’ అన్న ప్రమాణం తీసుకు న్నాడు. ఈ వచన ఆధారంగానే ముస్లింల ప్రార్థనా దిశ నియామకం జరిగింది. ఈ వచన ఆధారంగానే శ్రేష్ఠ సముదాయం వెలుగులోకి వచ్చింది.
ఈ శిష్ఠ వచనం అల్లాహ్‌ తన దాసులకు అనుగ్రహించిన గొప్ప వర ప్రసాదం. ఈ వచన భాగ్యానికి మించిన భాగ్యం మరొకటి  లేదు. ఈ వచన స్థాపన కోసమే సకల ప్రవక్తలు, సత్పురుషులు సంఘ బహిష్కర ణలకు, హత్యలకు, మారణకాండలకు గురయ్యారు. కొందరు నిలు వునా రెండుగా రంపాలతో కోయబడ్డారు. కొందరిని సజీవంగానే ఉంచి ఇనుప దువ్వెనలతో రక్కి మాంసాన్ని ఎముకల నుండి వేరు పర్చడం జరిగింది. కొందరిని సలసల మరగే నూనేలో నెట్టి వేంచే యడం జరిగింది. కొందరిని నిప్పులపై పడుకోబెట్టడం జరిగింది. కొందరిని సాపల్లో చుట్టి పొగెట్టడం జరిగింది. కొందరిని శిలువనెక్కిం చడం జరిగింది. మరికొందరిని వ్రేలాడదీసి శరీరాన్ని ముక్కముక్కలు గా కోయడం జరిగింది. ఈ వచన ఆధారంగానే సత్యాసత్యాల మధ్య సమర జ్వాలలు భగ్గుమన్నాయి. ఇదే శిష్ఠ వచనం, ఇదే శాంతి వచ నం, ఇదే శ్రేష్ఠ స్మరణ, ఇదే శాంతి నిలయం అయిన స్వర్గానికి తాళం చెవి. ఈ వచనాన్నే అల్లాహ్‌ ‘కలిమతున్‌ తయ్యిబా-సద్వచనం’ అని ‘ఉర్వతున్‌ ఉస్ఖా-బలీయమయిన కడియం’ అని అభివర్ణించాడు. ఇదే  సత్య వచనం, ఇదే ధర్మ ప్రవచనం, ఇదే మహి మాన్విత, మహోత్కృష్ట పుణ్య వచనం. ఇదే చిత్త శుద్ధికి చిహ్నం, దాసుని అంకితభావానికి ఆనవాలు, పుణ్యఫలానికి పునాది. ఇదే ధర్మ సందేశం. ఇన్ని వీశిష్ఠతల కారణంగానే ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అన్నింటికంటే ఉత్కృష్ట అల్లాహ్‌ స్మరణ – ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌”. (తిర్మిజీ)
ప్రవక్త నూహ్‌ (అ) వారికి మరణ ఘడియలు సమీపించినప్పుడు తన కుమారుణ్ణి పిలిచి ఇలా హితవు పలికారు: ”కుమారా! నేను నీకు రెండు విషయాల గురించి తాకీదు చేస్తున్నాను. రెండు విషయాల నుండి నిన్ను వారిస్తున్నాను. ఆయన చెప్పిన వాటిలో-”సప్తాకాశాలు, సప్త భూములు త్రాసు ఒక పళ్ళెంలో పెట్టి, ‘లా ఇలాహ ఇల్ల ల్లాహ్‌’ మరో పళ్ళెంలో పెట్టినట్లయితే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ ఉన్న పళ్ళమే వంగుతుంది’. సప్తాకాశాలు, సప్త భూములు ఒక ముద్దలా పదార్థంలా ఏర్పడితే వాటిన్నంటినీ లా ఇలాహ ఇల్లహ్‌ ఇల్లల్లాహ్‌ వేరు పరుస్తుంది. (అహ్మద్‌) ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటుంది:
”భూమ్యాకాశాలు కలిసి ఉండగా, మేము వాటి ని విడదీసిన వైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా ప్రాణమున్న ప్రతీదానిని మేము నీటితో సృష్టించాము”. (అన్బియా:30)
సృష్టి మొత్తం కలిసి కూడా ఈ వచనానికి సరి తూగజాలదు అంటే ఈ వచనం ఎంతటి మహి మాన్వితమయినదో అర్థం చేెసుకోగలరు. ఈ కారణంగానే విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స) తన జాతి వారిని, తద్వారా సమస్త మాన వాళిని తొలుత పిలుపునిచ్చింది ఈ శిష్ఠ వచనం వైపునకే. ఓ ప్రజలారా! మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్‌ చెప్పండి. తద్వారా అరబ్బు, అరబ్బేతర ప్రాంతాలు మీ పాదాక్రాంతమవుతాయి’ అని చెప్పారు.
ప్రియ పాఠకుల్లారా! ఒక వ్యక్తి ఈ వచనాన్ని చదివే ఇస్లాం పరిధిలోకి ప్రవేశిస్తాడు. మనం కూడా ఈ శిష్ఠ వచనం ఆధారంగానే ముస్లింలు గా పరగణించబడుతున్నాము. ఈ వచనం మరి
పెద్దదేమీ కాదు. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’. అయితే ఈ వచనాన్ని ఓ వ్యక్తి మనసా, వాఛా, కర్మణా-త్రికరణ శుద్ధితో ఉచ్చరించిన మరుక్ష ణమే అతని జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి.
ఆయన ఆబూ జర్‌ గిఫారీ (ర). మక్కా వచ్చిన ఆయన ప్రవక్త (స) ముహమ్మద్‌ వారితో కలవాలనుకున్నారు. కాని మక్కా అవిశ్వాసులు అంత సులువుగా ఎవరినీ ఆయనతో కలవనిచ్చేవారు కాదు గనక నక్కి నక్కి తిరగుతున్నా రాయన. ఎవరయినా గమనిస్తారేమోనని భయ పడుతున్నారు. చివరికి దైవప్రవక్త (స) వారి సన్నిధికి చేెరి ఈ శిష్ఠ వచన ప్రమాణం తీసుకున్న మరుక్షణం ఆయనలో ఎక్కడ లేని ధైర్యం పెల్లుబికింది. అప్పటి వరకు పిరికితనం ఆవహించిన ఆయన గుండె లో సాహసం ఉప్పొంగింది. క్షణం క్రితమే తనను ఎవరయినా గమని స్తారేమో అని భయపడిన ఆయన మొక్కవోని సాహసంతో కాబా ప్రాం గణంలోకెళ్ళి అందరి సమక్షంలో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ సద్వచన ప్రమాణాన్ని బాహాటంగా ప్రకటించారు.  అది విన్న అవిశ్వాస ప్రజలు ఆయనపై విరుచుకు పడ్డారు. ఆయన్ను చితక బాదుతున్నారు. అయినా ఆయన ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ శిష్ఠ వచనాన్ని జపిస్తూనే ఉన్నారు. ఇది కేవలం ఆయన ఒక్కరి విషయంలోనే కాదు, బిలాల్‌, మస్‌అబ్‌ బిన్‌ ఉమైర్‌, సుమయ్యా, యాసిర్‌, అమ్మార్‌, ఖబ్బాబ్‌, అబూ సలమా, అబూ బకర్‌, సుహైబ్‌ రూమీ-ఇలా ఒక్కరిద్దరు కాదు వందలాది, వేలాది,లక్షలాది ప్రజల్లో, నేడు 170 కోట్ల మంది ప్రజల్లో చైతన్యాన్ని నింపిన సద్వచనం లా ఇలా ఇల్లల్లాహ్‌ా.
అవును, ఈ శిష్ఠ వచనం చదవని క్షణ క్రితం వరకు కాఫిర్‌, అవిశ్వాసిగా ఉన్న మనిషి ఈ వచనం చదవిన మరుక్షణం అతను ముస్లిం, విశ్వాసి అయ్యాడు. ముందు అపరిశుద్ధ ఆలోచనలకు ఆలవాలంగా ఉన్న అతను ఇప్పుడు పవిత్ర ఆలోచనలకు నిలయంగా మారాడు. గతంలో అల్లాహ్‌ ఆగ్రహానికి ప్రాతుడయిన అతను, ఇప్పుడు అల్లాహ్‌ా అనుగ్రహానికి, అభిమానానికి అర్హుడయ్యాడు. ముందు స్వీయ సిద్ధాంతాల, నిజం లేని ఇజాల కారణంగా నరక వాసిగా ఉన్న అతను ఇప్పుడు స్వర్గవాసుల జాబితాలో చేరి పోయాడు. ఈ మార్పు ఇక్కడితోనే ఆగిపోయేది కాదు. అది మనిషి జీవితపు అన్ని అంగాల్లోనూ, అన్ని రంగాల్లోనూ, అతని సంబంధించిన క్రియలన్నిం టిలోనూ ఇది ప్రతిబింస్తుంది. ఈ వచనాన్ని సమ్మతించి పఠించే వారంతా ఒక సముదాయాం (ఉమ్మత్‌)గా, శ్రేష్ఠ సమాజంగానూ, దీన్ని త్రోసి పుచ్చినవారు మరో సంఘంగా రూపొందుతారు.
ఏమిటి? కేవలం నాలుకతో కొన్ని అక్షరాలను, పదాలను ఉచ్చరించ డం వల్ల ఇంతటి పెనుమార్పు సాధ్యమేనా? అన్న సందేహం అందరికి రావచ్చు. నిజమే, మంత్రాలకే చింతకాయలు రాలుతాయో లేదో, పర్వ తాలు కంపిస్తాయో లేదో, భూమి బ్రద్ధలవుతుందో లేదో, సముద్రాలు ఉప్పొంగుతాయో లేదో ఆ మంత్రాలను సర్వస్వంగా భావించేవారి వివేకానికే, బుద్ధికే వదిలేద్ధాం. ఎందుకంటే, ప్రభావమంతా పదాల్లోనే ఉంటుందని, వాటిని పలుకగానే మాయా ద్వారాలు తెరుచుకుంటా యని వారి విశ్వాసం, నమ్మకం. కాని ఇస్లాంలో అలా కాదు. అర్థానికే ఇక్కడ అగ్రపీఠం. పరమార్థానికే ఇక్కడ ప్రాధాన్యత, శబ్ధ ప్రభావం అర్థానికి లోబడి ఉంటుంది. అర్థమే అర్థం కాకపోతే అనర్థాలు జరుగు తాయి.   ఈ వచన భావం మనో ధరణిలో నాటుకోకపోతే, దాని శక్తి వల్ల మన భావాలు, స్వభాలు, ప్రవర్తన, ఆచరణలు మారకపోతే కేవలం కొన్ని పదాలను ఉచ్చరించినంత మాత్రాన ప్రళయం ఏమి ముంచుకు రాదు. మహిమ ఏదీ జరిగిపోదు. మహిమ జరుగుతుంది, పెను మార్పు చోటు చేసుకుంటుంది. కాని ఎప్పుడు? ఎప్పుడయితే మనం ఆ వచనాన్ని నోటితో పలికి, మనసుతో అంగీకరించి, అవయవాలతో దానికనుగుణంగా సదాచరణలు చేస్తామో అప్పుడు.
‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ ఈ శిష్ఠ వచనాన్ని మనం అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుని పలికినట్లయితే- అప్పుడు తెలుస్తుంది- మనం అల్లాహ్‌ా ఎదుట, సమస్త లోకాల ఎదుట ఎంత గొప్ప ప్రమాణం చేస్తు న్నామో. ఆ ప్రమాణం కారణంగా ఎంత గొప్ప బాధ్యత మనపై మోప బడుతుందో.
ఈ వచనాన్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరించాక మన భావ నలపై, అభిప్రాయాలపై, అలోచనపై, ఆచరణలపై, జీవితంలో ప్రతి విభాగంపై ఈ కలిమా ఆధిపత్యమే ఉండాలి. ఆ తర్వాత మన మనో మస్తిష్కాల్లో ఈ కలిమాకు విరద్ధమయిన ఏ విషయానికయినా, ఏ మాటకయినా, బాటకయినా చోటు ఇవ్వకూడదు. మన జీవితంలోని కార్యకలాపాలన్నింటిలో ఈ కలిమా మాత్రమే సర్వాధికారిగా ఉండాలి. ఎందుకంటే, ఈ కలిమాలో ఉన్నది సర్వలోక అధికారి అయిన అల్లాహ్‌ గనక.
ఈ వచనం పలికిన మరుక్షణం ప్రవక్త (స) వారి మాట మన విష యంలో నిజమవుతుంది. అవిశ్వాసుల స్వర్గంగా ఉన్న ప్రపంచం మన కోసం అడుగడున ఆంక్షలతో కూడిన చెరసాలగా మారి పోతుంది.  ఇప్పుడి మనం అల్లాహ్‌ ఆజ్ఞాబద్ధులయి జీవించాలి. ఆయన ఆదేశిం చిన వాటన్నింటిని అమలు పర్చాలి. ఆయన వారించిన వాటన్నింటి నుండి వైదొలగాలి. మన ప్రతి చర్య, ప్రతి క్రియ, ప్రతి కదలిక, ప్రతి శ్వాస ఆయన ఆజ్ఞల పద్దుల్లోనే, ఆయన ప్రవక్త (స) వారి ఆదర్శల సరిహద్దుల్లోనే, ఆయన గ్రంథ హద్దుల్లోనే జరగాలి. అయితే ఇంతటి మహిమాన్విత వచనాన్ని నిత్యం ఉచ్చరించే ముస్లింల, మన  జీవితా ల్లో ఎందుకు ఆశించినంత మార్పు కనబడటం లేదు? ‘అల్లాహ్‌ తప్ప నిజ ఆరాధ్యుడు లేడు’ అంటూనే అనేకానేక మిథ్యాభావాల ఉచ్చులో బిగించుకుపోతున్నాము. ఆయన దరిని వదలి దరి దరిన తలను వంచుతున్నాము.  ఆత్మావలోకానికి సమయమిదే!